జైపూర్: రాజస్థాన్ మంత్రి ప్రతాప్ సింగ్ కచరియావాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇంధన ధరలను పెంచిన కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ నేతలు రాముడి భక్తులు కాదని, వాళ్లు రావణ భక్తులు అని ఆయన విమర్శించారు. కశ్మీర్ ఫైల్స్ సినిమా కోసం ఎలా టికెట్లను పంచిపెడుతున్నారో అలాగే పెట్రోల్, డీజిల్ కోసం కూడా కూపన్లు పంచి పెట్టాలని డిమాండ్ చేశారు.జైపూర్లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతల రాముడి విధానాన్ని పాటించడం లేదని, వాళ్లు రావణుడి పాలసీని పాటిస్తున్నారని, రావణుడు ఓ మోసగాడు అని, కానీ రాముడు ఎవర్నీ మోసం చేయలేదని, ప్రతి ఒక్కర్నీ రాముడు సమానంగా చూశాడని అన్నారు. ఇవాళ కూడా పెట్రోల్పై 90, డీజిల్పై 76 పైసలు పెంచారు. గడిచిన 8 రోజుల్లో పెట్రోల్ ధరలను పెంచడం ఇవాళ ఏడోసారి.