హైదరాబాద్: ఒడిశాలోని బాలాసోర్ వద్ద శుక్రవారం ఘోరమైన రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. మూడు రైళ్లు ఢీకొన్న ఘటనలో 233 మంది మరణించారు. 900 మందికిపైగా గాయపడినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో బెంగుళూరు-హౌరా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమండల్ ఎక్స్ప్రెస్, గూడ్స్ రైలు ఢీకొన్నాయి. దేశంలో జరిగిన అయిదు భీకర రైలు ప్రమాదాల(Train Accidents) గురించి తెలుసుకుందాం. భారీ ప్రాణ నష్టాన్ని ఆ ప్రమాదాలు మిగిల్చాయి.
1. 1981లో బీహార్లో జరిగిన రైలు ప్రమాదంలో దాదాపు 500 నుంచి 800 వరకు ప్రయాణికులు మృతిచెందారు. ఆ ఏడాది జూన్ ఆరో తేదీన ఈ ఘటన జరిగింది. సహష్ర బీహార్ వద్ద ఉన్న భాగమతి నదిలో రైలు పడిపోవడంతో భారీగా ప్రాణ నష్టం జరిగింది.
2. 1995లో జరిగిన ఫిరోజాబాద్ రైలు ప్రమాదంలో 358 మంది మరణించారు. యూపీలోని ఫిరోజాబాద్ వద్ద పురుషోత్తమ్ ఎక్స్ప్రెస్, కాలిండి ఎక్స్ప్రెస్లు ఢీకొన్నాయి. 1995, ఆగస్టు 20వ తేదీన ఈ ఘటన జరిగింది.
3. అవద్-అస్సాం ఎక్స్ప్రెస్ దుర్ఘటనలో 268 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రమాదంలో మరో 359 మంది గాయపడ్డారు. 1999 ఆగస్టు రెండో తేదీన బ్రహ్మపుత్ర మెయిల్ రైలు, అవద్-అస్సాం రైళ్లు ఢీకొన్నాయి. గైసాల్ వద్ద ఆ ఘటన జరిగింది. బ్రహ్మపుతి మెయిల్ రైలులో బోర్డర్కు సైనికులు వెళ్తున్నారు.
4. ఖన్నా రైలు దుర్ఘటనలో 212 మంది చనిపోయారు. 1998, నవంబర్ 26వ తేదీన ఈ ఘటన జరిగింది. జమ్మూ తావి- సేల్దా ఎక్స్ప్రెస్ రైలు.. గోల్డెన్ టెంపుల్ మెయిల్కు చెందిన డీరైల్ బోగీలను ఢీకొట్టింది. పంజాబ్లోని ఖన్నాలో ఈ ఘటన జరిగింది. ఈ విషాద ప్రమాదంలో 212 మంది ప్రాణాలు కోల్పోయారు.
5. జ్ఞానేశ్వరి ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంలో 170 మంది మరణించారు. వెస్ట్ మిడ్నాపూర్ జిల్లాలో మావోలు రైలుపై అటాక్ చేశారు. ఈ ఘటన 2010, మే 28వ తేదీన జరిగింది.