న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈనెల 31వ తేదీ నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే తొలి రెండు రోజులు జీరో అవర్ ఉండదని పార్లమెంట్ వర్గాలు తెలిపాయి. 31వ తేదీన ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత సభ వాయిదా పడుతుంది. ఈ నేపథ్యంలో జీరో అవర్ ఉండదన్నారు. ఇక ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెడుతారు. 11 గంటలకు కేంద్ర మంత్రి సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెడుతారు. ఆ తర్వాత సభ వాయిదా పడుతంది. ఆ కారణంగా ఫిబ్రవరి ఒకటో తేదీన కూడా జీరో అవర్ ఉండదని పార్లమెంట్ వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి రెండవ తేదీ నుంచి జీరో అవర్ ఉంటుంది.