పాట్నా: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైల్వేను నాశనం చేసిందని రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) చీఫ్, మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) విమర్శించారు. మీడియాతో శనివారం ఆయన మాట్లాడారు. రైల్వే వ్యవస్థపై పెద్ద నిర్లక్ష్యం వల్లనే ఒడిశాలో జరిగిన మూడు రైళ్ల ప్రమాదంలో పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం జరిగిందని ఆరోపించారు. ఈ ప్రమాదంపై ఉన్నత స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాగా, ఆర్జేడీ పార్టీ కూడా ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై మండిపడింది. ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో శుక్రవారం మూడు రైళ్లు ఢీకొన్న ప్రమాద సంఘటన విషాదకరమని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్లో విలీనం చేయడాన్ని విమర్శించింది. ‘ఒకప్పుడు రైల్వే మంత్రి పేరు దేశానికి తెలుసు. రైల్వే బడ్జెట్ను ప్రత్యేకంగా సమర్పించేవారు. రైల్వేలను ప్రైవేటీకరించలేదు. యువతకు రైల్వేలో లక్షల ఉద్యోగాలు వచ్చేవి’ అని హిందీలో ట్వీట్ చేసింది.
మరోవైపు ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో రైల్వే మంత్రి ఎవరో తెలియదని ఆ ట్వీట్లో ఆర్జేడీ విమర్శించింది. ప్రస్తుతం అన్ని పచ్చ జెండాలను ఆడంబరాలను చాటుకునే ప్రచార మంత్రి ఊపుతున్నారని దుయ్యబట్టింది. అన్ని వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించడాన్ని ఈ మేరకు ఎద్దేవా చేసింది.
#WATCH | RJD chief & former Railways Minister Lalu Prasad Yadav speaks on #BalasoreTrainAccident; says, "…The manner in which they showed negligence & didn't show alertness led to such a large number of casualties…There should be a high-level inquiry and action should be… pic.twitter.com/01WgROya1t
— ANI (@ANI) June 3, 2023
दुःखद रेल हादसा।
एक दौर था जब देश रेल मंत्री का नाम जानता था। रेल बजट अलग पेश होता था।
रेलवे का निजीकरण नहीं हुआ था।
युवाओं को रेलवे में लाखों नौकरियाँ मिलती थी।अब कोई रेल मंत्री को नहीं जानता!
सारी हरी झंडी केवल और केवल एक आत्ममुग्ध प्रचारमंत्री दिखाता है। #RailAccident— Rashtriya Janata Dal (@RJDforIndia) June 3, 2023