(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్ (నమస్తే తెలంగాణ): విపక్ష ‘ఇండియా’ కూటమిలో ఐక్యత కనిపించడం లేదు. మధ్యప్రదేశ్లో అధికార బీజేపీకి కాంగ్రెస్ ప్రధాన పోటీదారుగా ఉండగా.. ఎస్పీ, ఆప్ కూడా బరిలోకి దిగాయి. ఇక తాము కూడా ఎన్నికల్లో పోటీచేస్తున్నట్టు బీహార్ సీఎం నితీశ్ కుమార్ పార్టీ జేడీయూ తాజాగా ప్రకటించింది. 10 స్థానాల్లో అభ్యర్థులను కూడా రంగంలోకి దించింది. సీట్ల పంపకంపై కాంగ్రెస్తో చర్చలు విఫలమైనందునే తాము పోటీ చేస్తున్నట్టు జేడీయూ నేత కేసీ త్యాగి పేర్కొన్నారు.