TCS | న్యూఢిల్లీ, మే 19: విదేశాలు సందర్శించేవారికి కేంద్ర ప్రభుత్వం తీపికబురును అందించింది. క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా విదేశాల్లో రూ.7 లక్షల లోపు పెట్టే ఖర్చుపై పన్ను లేదని స్పష్టంచేసింది. ఎల్ఆర్ఎస్ కింద 2.5 లక్షల డాలర్లు మేరకు ఖర్చు చేసుకునే పరిమితిలో క్రెడిట్ కార్డు ద్వారా జరిపే విదేశీ చెల్లింపులపై టీసీఎస్ ప్రక టించిన విషయం తెలిసిందే.
క్రెడిట్ కార్డుతో విదేశాల్లో పెట్టే ఖర్చుపై 20 శాతం పన్ను జూలై 1 నుంచి అమలులోకి రానున్నది. దీనిపై అభ్యంతరాలు వ్యక్తంచేయడంతో ఈ నిబంధనల్లో కొన్ని మార్పులు చేసింది. కానీ, రూ.7 లక్షల కంటే అధికంగా ఖర్చుచేస్తే మాత్రం 20 శాతం పన్ను విధించనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం విదేశాల్లో మెడికల్, విద్యా కోసం పెట్టే రూ.7 లక్షల లోపు పెట్టే ఖర్చుపై ఎలాంటి పన్ను విధించడం లేదు.