న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విస్తృతి నేపథ్యంలో దేశంలో రైలు సర్వీసులు కొనసాగుతాయా..? ఆగిపోతాయా..? అన్న ప్రజల సందేహాలకు తెరదించుతూ రైల్వేబోర్డు కీలక ప్రకటన చేసింది. దేశంలో అవసరం మేరకు రైలు సర్వీసులు యథాతథంగా కొనసాగుతాయని చెప్పారు. రైళ్లకు కొరతేమీ లేదని, రైలు సర్వీసులను నిలిపివేయాలనే ఆలోచన కూడా రైల్వేబోర్డు ఛైర్మన్, సీఈవో సునీత్ శర్మ వెల్లడించారు.
వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్, మే నెలల్లో సర్వీసులను మరింత పెంచామని సునీత్ శర్మ తెలిపారు. గోరఖ్పూర్, పట్నా, దర్భంగా, వారణాసి, గువాహటి, బరౌనీ, ప్రయాగ్రాజ్, రాంచి, లక్నో తదితర నగరాల్లో ప్రయాణికుల తాకిడి పెరిగే అవకాశం ఉండటంతో.. సెంట్రల్ రైల్వే పరిధిలో 58, వెస్టర్న్ రైల్వే పరిధిలో 60 సర్వీసులను అదనంగా కేటాయించినట్లు తెలిపారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,400 మెయిల్ ఎక్స్ప్రెస్ రైళ్లు, 5,300 సబర్బన్ సర్వీసులు నడుస్తున్నాయని రైల్వే బోర్డు చైర్మన్ చెప్పారు. ఇప్పుడు దాదాపు 800 ప్యాసింజర్ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయని, కరోనాకు ముందుతో పోల్చితే ఈ సంఖ్య తక్కువే అయినా రాష్ట్రాల నిర్ణయాల మేరకు అవసరమైతే సర్వీసుల సంఖ్యను పెంచుతామని ఆయన తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
కొవిడ్ రికవరీ రేటు మళ్లీ తగ్గిపోతోంది: కేంద్రం
మనిషిని పోలిన జీవికి మేక జన్మ.. దేవుడంటూ పూజలు
నిబంధనలు ఉల్లంఘిస్తే యమలోకానికే.. యముని వేషంలో కొవిడ్పై అవగాన..!
ఈ లక్షణం ఉంటే పుట్టేది ఆడపిల్లే
తెలంగాణలో కొత్తగా 2,478 కరోనా కేసులు
వేసవిలో మామిడిపండ్లు తినొచ్చా ?