గౌహతి: అస్సాంలో నైట్ కర్ఫ్యూ విధించాల్సిన అవసరం లేదని ఆ రాష్ట్ర మంత్రి హిమంత బిస్వా శర్మ గురువారం తెలిపారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితి అదుపులోనే ఉన్నదని మీడియాకు ఆయన చెప్పారు. అయితే ముంబై, కర్ణాటక నుంచి విమానాల్లో వచ్చే ప్రయాణికులు ఇక్కడ తప్పనిసరిగా కరోనా పరీక్ష చేయించుకోవాలని తెలిపారు. ప్రయాణికులు ఆయా రాష్ట్రాల్లో కరోనా పరీక్ష చేయించుకున్నప్పటికీ అస్సాంలో కూడా తప్పనిసరి అని అన్నారు.
ఈ ఏడాది అస్సాంలో బిహూ వేడుకను జరుపుతామని మంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు. ఈ వేడుకకు ముందు గరిష్ఠ సంఖ్యలో ప్రజలకు కరోనా పరీక్షలు నిర్వహిస్తామని, కరోనా సోకిన వారిని ఐసొలేట్ చేస్తామని వెల్లడించారు.