ముంబై : కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో మహారాష్ట్ర కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అక్టోబర్ 22 నుంచి కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అక్టోబర్ 22 నుంచి సినిమా థియేటర్లను తిరిగి ఓపెన్ చేసేందుకు అనుమతిస్తామని సీఎం ఉద్ధవ్ ఠాక్రే కార్యాలయం ప్రకటించింది.
ఇక అక్టోబర్ 7 నుంచి మహారాష్ట్రలో అన్ని ప్రార్ధనాలయాలు, ఆధ్యాత్మిక కేంద్రాలను తెరిచేందుకు అనుమతించనున్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయం ఇప్పటికే వెల్లడించింది. కాగా, కొవిడ్-19 సెకండ్ వేవ్ విరుచుకుపడటంతో మూతపడిన దేవాలయాలు, ప్రార్ధనాలయాలను తెరవాలని బీజేపీ గత కొంతకాలంగా డిమాండ్ చేస్తోంది.