న్యూఢిల్లీ, మార్చి 1: త్వరలో జరగబోయే లోక్సభ, అసెంబ్లీల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు శుక్రవారం అడ్వైజరీ జారీ చేసింది. కులం, మతం, భాష ప్రాతిపదికన పార్టీలు, నేతలు ఓట్లు అడగడాన్ని నిషేధించింది.
ప్రదేశాలను ప్రచారానికి వినియోగించరాదని పేర్కొన్నది. సామాజిక మాధ్యమాల్లో ప్రత్యర్థులను కించపరిచే పోస్టులు, అసత్య ప్రచారానికి సంబంధించిన పోస్టులను ఉంచడం కానీ, షేర్ చేయడం గానీ చేయరాదని ఈసీ హెచ్చరించింది. అభ్యర్థులు, క్యాంపెయినర్లు ఈ నిబంధనావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.