హైదరాబాద్, ఫిబ్రవరి 1 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): కేంద్రం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్పై సోషల్మీడియాలో సెటైర్లు పేలాయి. ‘బిల్కుల్ టైమ్ వేస్ట్’ అంటూ బడ్జెట్ గురించి భారత్-పే సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్ చురకలు అంటించారు. బడ్జెట్ అంత బాగుందికాబట్టే స్టాక్మార్కెట్ సూచీలు కుప్పకూలాయి అంటూ ఓ నెటిజన్ వ్యంగ్యంగా ట్వీట్ చేయగా..
మధ్యతరగతి ఆశలపై ఎప్పటిలాగే మోదీ సర్కారు నీళ్లుచల్లింది అంటూ మరో నెటిజన్ మండిపడ్డారు. మొత్తంగా కేంద్ర బడ్జెట్ గాలిబుడగ మాదిరిగా లోపలంతా డొల్లగా ఉందంటూ పలువురు చురకలు అంటించారు.