పాల్గడ్, డిసెంబర్ 11: మహారాష్ట్రలోని పాల్గడ్ జిల్లాలో దారుణం జరిగింది. క్యాబ్లో వెళ్తున్న మహిళను వేధించిన కొందరు దుండగులు.. ఆమె బిడ్డను బయటికి విసిరేశారు. ఈ ఘటనలో ఆ చిన్నారి అక్కడికక్కడే మృతిచెందింది. వివరాల్లోకెళితే.. ఓ మహిళ తన బిడ్డతో కలిసి పెల్హర్ నుంచి వాదా ప్రాంతానికి క్యాబ్లో బయలుదేరారు. అయితే డ్రైవర్తోపాటు క్యాబ్లోని కొందరు వేధింపులకు గురిచేయడంతో తప్పించుకోవడానికి ఆమె ప్రయత్నించారు.
దీంతో ఆ పసికందును కారు కిటికీలోంచి బయట పడేశారు. ఆ మహిళ కూడా తనను రక్షించుకొనేందుకు బయటకు దూకింది. ఈ క్రమంలో చిన్నారికి తీవ్ర గాయాలై మరణించింది. ఆమె తల్లికి కూడా గాయాలయ్యాయి. దర్యాప్తు చేపట్టిన పోలీసులు డ్రైవర్ను అరెస్టు చేసి.. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు.