న్యూఢిల్లీ: తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో 2027 యూపీ ఎన్నికల కోసం ఐ-ప్యాక్తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని సమాజ్వాదీ పార్టీ రద్దు చేసుకుంది. రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ ‘ఐ-ప్యాక్’ బెంగాల్లో అధికార తృణమూల్, తమిళనాడులో అధికార డీఎంకేకు తన సేవల్ని అందించింది.
ఈ రెండు రాష్ర్టాల్లో ఐప్యాక్తో పనిచేసిన అధికార పార్టీల ఓటమి, బలమైన నాయకురాలుగా పేరొందిన మమతా బెనర్జీ తన సొంత నియోజకవర్గంలో ఓటమిపాలవ్వటం.. సమాజ్వాదీ పార్టీ వర్గాల్ని కలవరపాటుకు గురిచేశాయి. అంతేగాక ఐప్యాక్ ఎదుర్కొంటున్న న్యాయపరమైన చిక్కులు, సమాజ్వాదీ పార్టీలో అంతర్గత విభేదాల నేపథ్యంలో ఐప్యాక్తో కుదిరిన ప్రతిపాదిత ఒప్పందం అమల్లోకి రాకుండానే ముగిసినట్టు తెలిసింది.