న్యూఢిల్లీ: ఎన్నికల బాండ్ల వివరాలను తెలిపేందుకు గడువు పెంచాలని కోరుతూ ఎస్బీఐ వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరపనున్నది. అలాగే గడువులోగా బాండ్ల వివరాలు ఈసీకి ఇవ్వకుండా సుప్రీంకోర్టు ఆదేశాల్ని ధిక్కరించిందని ఆరోపిస్తూ ఎస్బీఐకి వ్యతిరేకంగా దాఖలైన మరో రెండు పిటిషన్లపైనా కోర్టు విచారించనున్నది. ఇదివరకే ఏడీఆర్ ఎస్బీఐపై కోర్టు ధిక్కరణ పిటిషన్ వేయగా, ఆదివారం సీపీఎం కూడా మరో పిటిషన్ వేసింది.
సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల పట్ల ఎస్బీఐ ‘ఉద్దేశపూర్వక అవిధేయత’ చూపుతున్నదని సీపీఎం ఆరోపించింది. ఎన్నికల బాండ్ల పథకం చట్ట విరుద్ధమని పేర్కొంటూ.. 2019 ఏప్రిల్ 12 నుంచి ఇప్పటివరకు బాండ్ల అమ్మకాల వివరాల్ని మార్చి 6 నాటికల్లా ఈసీకి అందజేయాలని సుప్రీంకోర్టు ఎస్బీఐని ఆదేశించింది.