న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని శివసేన పార్టీ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై డిసెంబరు 31నాటికి నిర్ణయం తీసుకోవాలని శాసనసభాపతి రాహుల్ నార్వేకర్కు సుప్రీంకోర్టు గడువు విధించింది. ఆ పార్టీలోని ఉద్ధవ్ ఠాక్రే, ఏక్నాథ్ షిండే వర్గాలు ఎదుటి పక్షం ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ ఒకరిపై మరొకరు పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
మరోవైపు, ఎన్సీపీలోని అజిత్ పవార్ వర్గానికి చెందిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై వచ్చే జనవరి 31 నాటికి నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ను ఆదేశించింది.