న్యూఢిల్లీ: నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా జరిపించేలా లోక్సభ సెక్రటేరియట్కు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ‘ఇలాంటి పిటిషన్లను పరిశీలించడం కోర్టు విధి కాదు’ అని జస్టిస్ జేకే మహేశ్వరి, పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం శుక్రవారం వ్యాఖ్యానించింది.
పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవాన్ని రాష్ట్రపతి చేతులమీదుగా నిర్వహించాలని కోరుతూ న్యాయవాది జయ సుకిన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతికి ఆహ్వానం పంపకపోవడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా 20 ప్రతిపక్ష పార్టీలు ఈ కార్యక్రమాన్ని బాయ్కాట్ చేయాలని నిర్ణయించాయి.