న్యూఢిల్లీ: న్యాయవాదిగా నమోదు కావాలంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) గుర్తింపు పొందిన న్యాయ కళాశాలలోనే న్యాయ విద్య పూర్తి చేయాలని బీసీఐ రూపొందించిన నిబంధనలు చెల్లుతాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అడ్వొకేట్స్ యాక్ట్ 1961లోని సెక్షన్ 24 ప్రకారం న్యాయవాదుల నమోదుకు బీసీఐ ఎలాంటి నిబంధనలను రూపొందించలేదని 2012 సెప్టెంబరు 21న ఒరిస్సా హైకోర్టు తీర్పు ఇచ్చింది.
ఈ తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను జస్టిస్ విక్రమ్నాథ్, సంజయ్ కుమార్తో కూడిన సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ జరిపింది. ఒరిస్సా హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేస్తున్నట్టు పేర్కొన్నది. న్యాయవాదిగా నమోదవడానికి బీసీఐ నిబంధనలు రూపొందించగలదని స్పష్టం చేసింది.