న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: నాలుగో తరగతికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి తన పై అధికారులతో సంబంధం లేకుండా నేరుగా ఉన్నతాధికారులకు సమస్య విన్నవించుకోవటం శిక్షార్హమైన నేరం కాదని సుప్రీం కోర్టు శనివారం స్పష్టం చేసింది. నాలుగో తరగతి ఉద్యోగి ఛత్రపాల్ దాఖలు చేసిన రిట్ పిటీషన్ను విచారించిన సుప్రీం ఈ మేరకు తీర్పునిచ్చింది.
అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేస్తూ.. బాధితుడిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సుప్రీం ఆదేశించింది. ఛత్రపాల్ను బరేలీ జిల్లా కోర్టు నుంచి నజరత్ కోర్టుకు ప్రాసెస్ సర్వర్ ఉద్యోగిగా బదిలీ చేశారు. అయితే అతనికి పాత ఆర్డర్లీ వేతనాన్నే ఇస్తుండటంతో సమస్య పరిష్కారం కోరుతూ ముఖ్యమంత్రితో సహా అలహాబాద్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్కు, ప్రభుత్వంలోని మరొకొంత మంది ఉన్నతాధికారులకు విన్నవించుకున్నాడు. ఇలా చేసినందుకు అతడిని ఉద్యోగం నుంచి తొలగించారు. దీన్ని సవాల్ చేస్తూ బాధితుడు సుప్రీం కోర్టును ఆశ్రయించాడు.