న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: ఇటీవల కర్ణాటకలో ఐఐటీ-దార్వాడ్ క్యాంపస్ను ప్రధాని మోదీ ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.9.49 కోట్లను ఖర్చు చేసింది. సమాచార హక్కు చట్టం కింద వెల్లడైన వివరాల ప్రకారం.. ప్రజలను తరలించడానికి రూ.2.83 కోట్లు, స్టేజ్, గ్రీన్ రూమ్, బారికేడ్లకు రూ.4.68 కోట్లు, భోజనాలకు రూ.86 లక్షలు ఇలా మొత్తంగా రూ.9.49 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది.
అయితే కొన్ని గంటలపాటే సాగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి దాదాపు రూ.10 కోట్ల వరకు ఖర్చు చేయడాన్ని ప్రతిపక్షాలు తప్పుపట్టుతున్నాయి. రిబ్బన్ కటింగ్కు రూ.10 కోట్లా? అని నిలదీస్తున్నాయి. జేడీఎస్ నేత హన్సాహిమరాద్ మాట్లాడుతూ ఖర్చును తక్కువ చేసి చూపిస్తున్నారని, తమ అంచనా ప్రకారం రూ.20 కోట్ల వరకు ఖర్చు అయ్యి ఉండొచ్చని చెప్పారు.