న్యూఢిల్లీ : ‘ఉన్నావ్ రేప్’ కేసులో దోషిగా తేలిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్కు ఇటీవల బెయిల్ లభించటం సంచలనంగా మారింది. బెయిల్పై అతడు బయటకు రావటంతో.. బాధితురాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటివద్ద ఉన్న తన పిల్లలకు కూడా రక్షణ లేకుండా పోయిందని వాపోయారు.
సెంగార్ బెయిల్ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం విచారించనున్నది. ‘సుప్రీంకోర్టులో న్యాయం దక్కుతుందన్న నమ్మకముంది. అతడికి బెయిల్ రాకుండా ఉండాల్సింది. నా తండ్రిని, కుటుంబాన్ని కోల్పోయాను. ఇప్పుడు నా పిల్లల భద్రత కూడా ప్రమాదంలో పడింది’ అంటూ బాధితురాలు వాపోయారు.