న్యూఢిల్లీ: తప్పుడు సిగ్నలింగ్ వల్లే ఇటీవల ఒడిశాలోని బాహానగా రైల్వే స్టేషన్ దగ్గర ఘోర రైలు ప్రమాదం జరిగిందని రైల్వే భద్రత కమిషన్ రైల్వే బోర్డుకు సోమవారం నివేదించింది. రెండు ట్రాక్ల స్విచ్ల పనితీరులో లోపాలు కనిపించి ఉంటే సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్ విభా గాలు నష్ట నివారణ చర్యలు తీసుకొని ఉండాల్సిందని కమిషన్ అభిప్రాయపడింది.
లెవల్ క్రాసింగ్ గేట్ 94 వద్ద అనుమతి పొందిన సర్క్యూట్ డయాగ్రామ్ను ఎలక్ట్రికల్ లిఫ్టింగ్ బారియర్ స్థానంలో సరఫరా చేయకపోవడం తప్పుడు వైరింగ్కు దారి తీసిందని తెలిపింది.