Pulwama Attack | న్యూఢిల్లీ: అది 2019, ఫిబ్రవరి 14. జమ్ముకశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడితో దేశమంతా ఉలిక్కిపడింది. కాన్వాయ్పై ఉగ్రవాదులు జరిపిన బాంబు దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. లోక్సభ ఎన్నికలకు రెండు నెలల ముందు జరిగిన ఈ ఉగ్రదాడి, ప్రతిగా జరిపిన బాలాకోట్ వైమానిక దాడులను బీజేపీ రాజకీయంగా ఉపయోగించుకొన్నదనే విమర్శలు ఉన్నాయి. అయితే పుల్వామా ఉగ్రదాడిని పసిగట్టడంలో నిఘా వర్గాల వైఫల్యం చెందాయనే ఆరోపణలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు.
దీనిపై ప్రతిపక్షాలతోపాటు అన్ని వర్గాల నుంచి మోదీ సర్కార్కు ప్రశ్నలు ఎదురయ్యాయి.. ఎదురవుతున్నాయి! తాజా గా నిఘా సంస్థల వైఫల్యం ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందేనని బాధిత అమర జవాన్ల భార్యలు, కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఆరోపణలకు సంబంధించి జవాబుదారీతనాన్ని నిర్ధారిస్తూ శ్వేతపత్రం విడుదల చేయాలని కోరుతున్నారు. ఈ డిమాండ్తో అమర జవాన్ల కుటుంబసభ్యులు వచ్చే నవంబర్ 26న దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళన చేపట్టనున్నారని మాజీ పారామిలటరీ దళాల సంక్షేమ సంఘం జాతీయ సమన్వయకర్త రణబీర్ సింగ్ వెల్లడించారు.
పుల్వామా ఉగ్రదాడి జరిగి నాలుగేండ్లకు పైగా గడిచిందని, 40 మంది జవాన్ల మృతికి దారితీసిన అధికారుల వైఫల్యానికి జవాబుదారీతనం, బాధ్యతను నిర్ణయించడంలో ప్రభు త్వం విఫలమైందని రణబీర్ సింగ్ విమర్శించారు. ఎన్నికల సమయంలో జాతీయవాదం గురించి చెప్పే మోదీ సర్కార్.. 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మృతికి దారితీసిన కారణాలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిఘా వైఫల్యానికి బాధ్యులెవరో తెలుసుకొనే హక్కు బాధిత కుటుంబసభ్యులకు ఉందన్నారు. మోదీ ప్రభుత్వ నిఘా వైఫల్యం కారణంగానే పుల్వామా దాడి ఘటన జరిగిందని జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాన్ని రణబీర్ పేర్కొన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పుల్వామా దాడి జవాబుదారీతనాన్ని నిర్ధారించకుండా.. డిమాండ్ చేసిన వారిపై దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి వారి నోరు మూయించేందుకు ప్రయత్నిస్తున్నదని రణబీర్ ఆరోపించారు. సత్యపాల్ మాలిక్కు సీబీఐ ఇచ్చిన సమన్లను ఆయన ప్రస్తావించారు.
జవాన్లను తరలిచేందుకు విమానం ఇవ్వాలన్న అభ్యర్థనను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించిందని చెప్పడంతో.. ‘మీరు ఇప్పుడు సైలెంట్గా ఉండండి’ అని మోదీ తనతో అన్నారని మాలిక్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. పుల్వామా దాడి జవాబుదారీతనాన్ని నిర్ధారించడంలో నాలుగేండ్లుగా మోదీ సర్కార్ విఫలమైందని, ఎన్నికల్లో గెలువడమే వారి ప్రథమ ప్రాధాన్యతం అని మాలిక్ విమర్శించారు. దేశ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఈసారి లోక్సభ ఎన్నికలకు ముందు కూడా పుల్వామా తరహా ఘటనలు జరుగొచ్చని హెచ్చరించారు. 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మరణాలు, బాలాకోట్ దాడులను 2019 లోక్సభ ఎన్నికల సమయంలో మోదీ రాజకీయంగా ఉపయోగించుకొన్నారని, మొదటిసారి ఓటే సే వారు తమ ఓటును బాలాకోట్పై వైమానిక దాడులు చేసిన వీర సైనికులకు అంకితం ఇవ్వాలని పిలుపునిచ్చిన
విషయాన్ని పేర్కొన్నారు.