ఇటీవల చిన్నారులపై కుక్కకాట్లు ఎక్కువైపోతున్నాయి. రెండు రోజుల క్రితం యూపీలోని ఘజియాబాద్, నోయిడాలో చిన్నారులపై కుక్కలు దాడిచేసిన ఘటన మరువకముందే ఘజియాబాద్లో మరొక ఘోర సంఘటన జరిగింది. పదేళ్ల చిన్నారిపై ఓ పిట్బుల్ డాగ్ విచక్షణారహితంగా దాడిచేసింది. ఆ బాలుడి ముఖంపై పలచోట్ల కరిచింది. దీంతో అతడి ముఖంపై 150చోట్ల కుట్లు పడ్డాయి. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
ఈ ఘటన సంజయ్నగర్ పార్కులో జరిగింది. కుక్క యజమాని లలిత్ త్యాగి సాయంత్రంపూట పార్కులో వాకింగ్ కోసం తన పిట్బుల్ డాగ్ను తీసుకెళ్లాడు. అది తప్పించుకుని అక్కడే ఆడుకుంటున్న చిన్నారిపై దాడి చేసింది. యజమాని ఎంత ప్రయత్నించినా కుక్క కంట్రోల్ కాలేదు. వెంటనే చిన్నారిని దవాఖానకు తరలించారు. వైద్యులు అతడి ముఖంపై 150 కుట్లు వేశారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎలాంటి లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ లేకుండా కుక్కను పెంచుకున్న యజమానికి సంబంధిత అధికారులు రూ. 5,000 జరిమానా విధించారు. ఈ సంఘటన సెప్టెంబర్ 3న జరిగింది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నది.
3/9/22: A 10-year-old boy playing in the Ghaziabad park was attacked by a dog of Pitbull breed on last saturday, The child necessitating more than 100 stitches on his face. The kid is not able to talk.
CCTV footage surfaces. pic.twitter.com/QcZ0nYl3ZM— Muktanshu (@muktanshu) September 8, 2022