న్యూఢిల్లీ, ఆగస్టు 6: ఉమ్మడి ఓటర్ల జాబితా రూపొందించడంలో తొందర వద్దని ఎన్నికల సంఘానికి పార్లమెంటరీ కమిటీ సూచించింది. ఈ విషయంలో రాజ్యాంగబద్ధ నిబంధనలు, రాష్ర్టాల అధికారాలను పరిగణనలోకి తీసుకోవాలని, సమాఖ్య వ్యవస్థ సూత్రాలను కచ్చితంగా దృష్టిలో ఉంచుకోవాలని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు, సంబంధిత పక్షాలతో విస్తృత చర్చలు జరుపాలని పేర్కొన్నది.