Corona Virus | దేశంలో కరోనా వైరస్ (Corona Virus) కోరలు చాస్తోంది. గత కొన్ని రోజులుగా వైరస్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. తాజాగా కొవిడ్ కేసుల సంఖ్య 4వేలకు చేరువైంది.
కేంద్ర ఆరోగ్య శాఖ డేటా ప్రకారం.. జూన్ 2 ఉదయం 8 గంటల సమయానికి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,961కి పెరిగింది. వీటిలో కేరళ రాష్ట్రంలో అత్యధికంగా 1435 కేసులు వెలుగు చూడగా.. మహారాష్ట్రలో 506, ఢిల్లీలో 483, గుజరాత్లో 338, పశ్చిమ బెంగాల్లో 331, కర్ణాటకలో 253 కేసులు వెలుగు చూశాయి. గత 24 గంటల్లో నాలుగు మరణాలు నమోదయ్యాయి. ఢిల్లీ, తమిళనాడు, కేరళ, మహారాష్ట్రలో ఒక్కొక్కరు చొప్పున వైరస్ కారణంగా మరణించారు. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకూ కొవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య 32కి పెరిగింది.
Also Read..
Vitamin D Deficiency | 70శాతం ముస్లిం మహిళల్లో విటమిన్-డీ లోపం..! అసలు కారణం ఏంటంటే..?
వాణిజ్య సిలిండర్పై రూ.24 తగ్గింపు
ఎన్సీపీకి నాగాలాండ్లో భారీ ఎదురుదెబ్బ