న్యూఢిల్లీ, జూలై 25: దళితులపై నేరాల్లో బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ మొదటిస్థానంలో ఉందని ఎన్సీఆర్బీ -2021 నివేదిక పేర్కొన్నది. దళితులపై దాడుల్లో 2020లో రాజస్థాన్ మొదటి స్థానంలో ఉండగా, మధ్యప్రదేశ్ 2వ స్థానంలో నిలిచింది. 2021 నాటికి మధ్యప్రదేశ్లో మొదటి స్థానానికి చేరుకుంది.
జాతీయ సగటు 22.6గా ఉంటే, మధ్యప్రదేశ్లో 63.6 నమోదవ్వటం.. ఆ రాష్ట్రంలో దళితుల పరిస్థితి ఎంత దయనీయం మారిందో అర్థం చేసుకోవచ్చు. 60.8 శాతంతో రాజస్థాన్ రెండో స్థానంలో నిలవటం గమనార్హం. ఆ ఏడాది దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు 45,610 నమోదయ్యాయి. అంతక్రితం ఏడాది పెండింగ్ కేసుల సంఖ్య 17,146గా ఉందని నివేదిక పేర్కొన్నది. దేశంలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో 9,492 కేసులు నమోదయ్యాయి.