NREGA | న్యూఢిల్లీ: దేశంలోని పేదలకు ఉపాధి కల్పించే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఏ)ను పూర్తిగా ఎత్తివేసే కుట్రలో భాగంగానే కేంద్రం బెంగాల్లో దీనిని తాత్కాలికంగా నిలిపివేసిందని ఎన్ఆర్ఈజీఏ సంఘర్ష్ మోర్చా ఆరోపించింది. అయితే ఈ పథకాన్ని కాపాడేందుకు 2024 ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలని మోర్చా పిలుపునిచ్చింది.
కార్మికులు, హక్కుల నేతలు, విద్యావేత్తలతో కూడిన ఎన్ఆర్ఈజీఏ సంఘర్ష్ మోర్చా ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన రెండు రోజుల జాతీయ కన్వెన్షన్లో బెంగాల్లో నిలిపివేసిన ఎంజీఎన్ఆర్ఈజీఏ పథకం గురించి చర్చించింది.