హైదరాబాద్, ఫిబ్రవరి 1 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): పేద, మధ్య తరగతి వర్గాలకు లబ్ధి చేకూర్చే సంక్షేమ పథకాలకు అత్తెసరు నిధులను కేటాయించారంటూ నిరుడు కూడా మోదీ ప్రభుత్వంపై పెద్దయెత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే, కేటాయించిన ఆ అత్తెసరు నిధులను కూడా కేంద్రం పూర్తిగా ఖర్చు చేయలేదని తాజాగా తేలింది.
ఈ మేరకు నిరుడి బడ్జెట్ కేటాయింపులు, సవరించిన అంచనాలను బట్టి అర్థమవుతున్నది.
