న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మోహన్ శాంతనగౌడర్ కన్నుమూశారు. ఆయన వయసు 62 ఏండ్లు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆయన గురుగావ్లోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. 2017 ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. 2023 వరకు ఆయన పదవీకాలం ఉంది. జస్టిస్ శాంతనగౌడర్ మృతికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సంతాపం వ్యక్తం చేశారు. విలువైన సహోద్యోగిని కోల్పోయామన్నారు.