కోటా: మహా శివరాత్రి ఉత్సవాల సందర్భంగా ‘శివ్ బారాత్’ ప్రదర్శనలో పాల్గొన్న 16 మంది బాలలు విద్యుదాఘాతానికి గురయ్యారు. రాజస్థాన్లోని కోటా నగర పోలీసు సూపరింటెండెంట్ అమృత దుహాన్ తెలిపిన వివరాల ప్రకారం.. మహా శివరాత్రి సందర్భంగా శుక్రవారం ఉదయం కోటాలోని కాళీ బస్తీ గుండా ‘శివ్ బారాత్’ ప్రదర్శన జరిగింది.
ప్రదర్శనలో ఓ బాలుడు 22 అడుగుల పొడవైన వెదురు కర్రకు కట్టిన జెండాను తీసుకెళ్తున్నాడు. ఆ జెండా హైటెన్షన్ విద్యుత్తు తీగకు తగలడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. అతనికి 100 శాతం కాలిన గాయాలయ్యాయి. అతనిని కాపాడేందుకు ప్రయత్నించిన మరికొందరికి 50% లోపు కాలిన గాయాలయ్యాయి.