Congress | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీని వీడిపోతున్న సీనియర్ల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నది. తాజాగా మధ్యప్రదేశ్కు చెందిన మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నే త కమల్నాథ్, ఆయన కు మారుడు నకుల్నాథ్తో స హా బీజేపీలో చేరుతున్నట్టు ఊహాగానాలు గుప్పుమంటున్నాయి. ఇదే గనుక నిజమై తే కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలినట్టేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఊహాగానాలంతటికీ కారణం నకుల్నాథ్ తన ఎక్స్ ఖాతాలో కాంగ్రెస్ పేరును తొలగించటమే. నకుల్నాథ్ మ ధ్యప్రదేశ్ నుంచి కాంగ్రెస్ తరుఫున ఏకైక ఎంపీ.
ఎన్నికల వేళ ఉన్న ఒక్క ఎంపీ కూ డా పార్టీని వీడితే ఇక కాంగ్రెస్కు ఇబ్బందులు తప్పవు. ఈ ఊహాగానాలకు తోడు కమల్నాథ్, నకుల్నాథ్ ఇద్దరూ హడావిడిగా ఢిల్లీకి బయల్దేరి వెళ్ళారు. శనివారం ఢిల్లీలో బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావే శం అనంతరం కమల్నాథ్ బీజేపీ పెద్దల తో సమావేశమై కీలక ప్రకటన చేస్తారని వినిపించింది. కానీ కమల్నాథ్ మాత్రం ఇప్పటి వరకు బీజేపీలో చేరుతున్నట్టు ఎ లాంటి ప్రకటన చేయలేదు.
మధ్యప్రదేశ్ బీజేపీ చీఫ్ వీడీ శర్మ ఈ వదంతులపై స్పం దిస్తూ.. కమల్నాథ్ బీజేపీలోకి వస్తే సంతోషంగా స్వాగతిస్తామన్నారు. అయోధ్యలో రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానించినా కాంగ్రెస్ పార్టీ తిరస్కరించటం ఆ పార్టీలోని పలువురికి నచ్చలేదని తెలిపా రు. వీడీ శర్మ ఈ ప్రకటన చేసిన మరుసటి రోజే కమల్నాథ్ బీజేపీలో చేరుతున్నారన్న వార్తలు రావటం గమనార్హం. అయితే కమల్నాథ్ బీజేపీలో చేరుతారన్న వార్తను కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ ఖండించారు. తనకు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సీటు కేటాయించకపోవడంపై కమల్నాథ్ అసంతృప్తితో ఉన్నారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.