న్యూఢిల్లీ: ఆప్ జాతీయ పార్టీ హోదా అంశాన్ని ఏప్రిల్ 13లోగా తేల్చాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కర్ణాటక హైకోర్టు ఆదేశించింది. హోదా ఇవ్వకుండా కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) కావాలనే తాత్సారం చేస్తున్నదని ఆప్ బుధవారం కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది.
ఈ పిటిషన్పై జస్టిస్ ఎం నాగప్రసన్న నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. హోదా అందుకునేందుకు ఆప్కు అన్ని అర్హతలున్నాయని ధర్మాసనం ముందు ఆప్ తరఫు న్యాయవాది ప్రస్తావించారు.