రాంచీ: బీజేపీకి ఇచ్చిన జాతీయ పార్టీ గుర్తింపును సస్పెండ్ చేయాలని జేఎంఎం ఎన్నికల కమిషన్ను శనివారం డిమాండ్ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభ ఎన్నికల ప్రచార సభల్లో అమర్యాద భాషను ఉపయోగిస్తున్నందువల్ల ఈ చర్య తీసుకోవాలని కోరింది.
మోదీ బీజేపీ స్టార్ క్యాంపెయినర్ అని, ఆయన ప్రసంగాల్లో మతాన్ని ప్రస్తావిస్తున్నారని తెలిపింది. ఇది నిబంధనలకు విరుద్ధమని, మతం, వర్గాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయకుండా బీజేపీ స్టార్ క్యాంపెయినర్లను కట్టడి చేయాలని డిమాండ్ చేసింది.