తిరువనంతపురం: కేరళలోని తిరువనంతపురంలో వరకట్న వేధింపులతో ఓ వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వరకట్నంగా బీఎండబ్ల్యూ కారు, 15 ఎకరాల భూమి, 150 సవర్ల బంగారం ఇవ్వాలని ఆమె ప్రియుడి కుటుంబం డిమాండ్ చేయడంతో.. వాటిని ఇచ్చే స్తోమత లేక షహానా అనే వైద్యురాలు బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలి బాయ్ఫ్రెండ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం, ప్రభుత్వ వైద్య కళాశాలలో పోస్ట్గ్రాడ్యుయేషన్ చేస్తున్న షహానా, డాక్టర్ ఈఏ రువాయిస్ ఇరువురు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే రువాయిస్ కుటుంబం కోరినట్టుగా వరకట్నం ఇవ్వలేమని షహానా కుటుంబ సభ్యులు చెప్పడంతో వారు పెండ్లిని రద్దు చేశారు.