న్యూఢిల్లీ: సార్వత్రిక లోక్సభ ఎన్నికల్లో తొలి దశ ఎన్నికల ప్రచారానికి బుధవారం సాయంత్రంతో తెర పడింది. తొలి దశలో మొత్తం 21 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి 102 లోక్సభ స్థానాల్లో ఈ నెల 19 న పోలింగ్ జరుగనున్నది. తమిళనాడులోని 39 స్థానాలతో పాటు రాజస్థాన్కు చెందిన 12, యూపీలో 8, మధ్యప్రదేశ్లో 6, మహారాష్ట్ర, అసోం, ఉత్తరాఖండ్ రాష్ర్టాల్లో 5 చొప్పున బీహార్లో 4, పశ్చిమ బెంగాల్లో 3; అరుణాచల్ప్రదేశ్, మణిపూర్, మేఘాలయాలో 2 చొప్పున, ఛత్తీస్గఢ్, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్ నికోబార్, జమ్ము కశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిలలో ఒక్కో స్థానానికి ఎన్నిక జరగనున్నది.