బెంగళూరు, నవంబర్ 21: ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో.. ఎనిమిది మందిని ప్రయాణం మధ్యలోనే దింపేసింది. మరో విమానంలో పంపిస్తామని సిబ్బంది నమ్మించి బెంగళూరు ఎయిర్పోర్టులోనే దింపేశారు. కానీ, అక్కడ మరో ఫ్లైట్ లేదు.
మరుసటి రోజు ప్రయాణికులను తమ గమ్యస్థానమైన చెన్నైకి పంపించారు. ఎనిమిది మందితో ట్రిప్ నడపడం ఇష్టం లేక ఇండిగో సంస్థ సిబ్బంది తమను మోసగించి దింపేశారని ప్రయాణికులు మండిపడ్డారు. ఆదివారం అమృత్సర్ నుంచి బెంగళూరు మీదుగా చెన్నై వెళ్లే విమానంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.