న్యూఢిల్లీ: మహదేవ్ యాప్ కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో రూ.580 కోట్లకుపైగా సెక్యూరిటీ హోల్డింగ్స్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) స్తంభింపజేసింది. అంతే కాకుండా రూ.3.64 కోట్ల నగదు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకుంది. తాజా దాడుల అనంతరం ఈ చర్యలు చేపట్టామని ఈడీ శుక్రవారం వెల్లడించింది.
ఈ ఆస్తులు దుబాయ్లోని హవాలా ఆపరేటర్ హరిశంకర్ టిబ్రేవాలాకు చెందినవని తెలిపాయి. మహదేవ్ కేసులో ఈడీ ఫిబ్రవరి 28న కోల్కతా, గురుగ్రామ్, ఢిల్లీ, ఇండోర్, ముంబై, రాయ్పూర్లలో సోదాలు చేసింది. ఛత్తీస్గఢ్కు చెందిన ఉన్నత స్థాయి రాజకీయ నేతలు, బ్యూరోక్రాట్ల ప్రమేయం ఉంది. హరిశంకర్ మహదేవ్యాప్ ప్రమోటర్లకు భాగస్వామి. సొంతంగా స్కైఎక్సేంజ్ అనే బెట్టింగ్ యాప్ను కూడా నిర్వహిస్తున్నారు. మొత్తం మీద ఇది దాదాపు రూ.6 వేల కోట్ల కుంభకోణమని సమాచారం.