Election Commission | ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తో కీలక సమావేశం నిర్వహించనుంది. ఒమిక్రాన్ విస్తరిస్తున్న నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలు వాయిదా వేయాలని డిమాండ్లు వస్తున్నాయి. దీంతో ఈ సమావేశానికి అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి, ప్రస్తుత పరిస్థితులపై కూలంకషంగా ఈసీ ఓ రిపోర్టు కోరే ఛాన్స్ ఉంది. వచ్చే నెలలో ఈసీ పోలింగ్ తేదీలను ప్రకటిస్తుందని ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి భూషణ్ నుంచి ఈసీ కొన్ని సలహాలు, సూచనలను కూడా తీసుకుంటుందని తెలుస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ ఇచ్చే రిపోర్టుల ప్రకారం అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై ఈసీ ఓ నిర్ణయానికి రానుందని తెలుస్తోంది.