న్యూఢిల్లీ: అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మపై కాంగ్రెస్ చేసిన ఫిర్యాదుపై ఎన్నికల కమిషన్ గురువారం స్పందించింది. ఛత్తీస్గఢ్ మంత్రి మహమ్మద్ అక్బర్ను ఉద్దేశించి శర్మ అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఈసీని కోరింది. ఈ వ్యాఖ్యలపై ఈ నెల 30 సాయంత్రంలోగా వివరణ ఇవ్వాలని శర్మను ఈసీ ఆదేశించింది. కాంగ్రెస్ ఫిర్యాదులో తెలిపిన వివరాల ప్రకారం, కవర్ధలో ఈ నెల 18న జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో శర్మ మాట్లాడుతూ, అక్బర్ను పంపించేయకపోతే శ్రీరాముని తల్లి కౌసల్య పుట్టిన గడ్డ అపవిత్రమవుతుందన్నారు.
కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీకి ఈసీ గురువారం నోటీసు ఇచ్చింది. రాజస్థాన్లోని దౌసాలో ఈ నెల 20న జరిగిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీపై ఆమె చేసిన వ్యాఖ్యలపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు చేసింది. ప్రియాంక దౌసా సభలో మాట్లాడుతూ, మోదీ ఓ దేవాలయానికి ఎన్వలప్లో విరాళం ఇచ్చారని చెప్పారు. దాన్ని తెరిచి చూస్తే రూ.21 ఉన్నట్లు తాను టీవీలో చూశానని చెప్పారు. బీజేపీ ప్రజలకు ఎన్వలప్లను చూపిస్తుందని, అయితే వాటిలో ఏమీ ఉండదని అన్నారు.