న్యూఢిల్లీ: పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, నీటి కొరతతో ఇబ్బందిపడుతున్న దేశ ప్రజలకు వాతావరణ శాస్త్రవేత్తలు కాస్త ఊరట కలిగించే వార్త చెప్పారు. ఈ ఏడాది చాలా ప్రాంతాల్లో ఎల్నినో ప్రభావం తగ్గనుందని భారత వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు.
ఎల్నినో పరిస్థితులు క్షిణించనున్నాయని, భారత్లో రుతు పవనాలకు అనుకూల పరిస్థితులు ఉండే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.