న్యూఢిల్లీ: ఇండ్ల మధ్య పబ్లిక్ మూత్రశాల, చెత్త డబ్బాలు ఉండటం వల్ల పౌరులు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించడానికి ఇబ్బందులు తలెత్తుతాయని, జీవించే ప్రాథమిక హక్కును కోల్పోతారని ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. పిటిషనర్ ఇంటికి దూరంగా చెత్త కుండీ, పబ్లిక్ మూత్రశాల ఏర్పాటు చేయాలని మున్సిపల్ కార్పొరేషన్ను జడ్జి ఆదేశించారు.
ఓ న్యాయవాది పిటిషన్ పై జడ్జీ పై విధంగా వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 16న ఈ కేసుపై వాదనలు జరిగాయి. పిటిషనర్తో పాటు అతడి చుట్టుపక్కల వారికి పరిశుభ్రంగా జీవించే హక్కు ఉందని చెప్పింది.