న్యూఢిల్లీ, మే 9: సంతాన సామర్థ్యం లేని దంపతులు సరోగసీ పద్ధతిని వినియోగించుకోకుండా కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు మంగళవారం విచారించింది. కేంద్ర ఉత్తర్వుల ప్రకారం దాత పునరుత్పత్తి కణాలు ఇవ్వడానికి వీలు లేదు.
కేంద్రం నిర్ణయం ప్రాథమిక హక్కుల్లోని ఆర్టికల్ 14, 21ను ఉల్లంఘించేలా ఉన్నాయని పిటిషన్దారులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ అంశంపై వైఖరి తెలియజేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి కోర్టు నోటీసులు జారీ చేసింది.