న్యూఢిల్లీ, మే 12: ఎన్నికైన ప్రభుత్వానికే శాసన, కార్య నిర్వహణాధికారాలు ఉంటాయన్న సుప్రీంకోర్టు తీర్పును కేంద్రం పాటించడం లేదని ఢిల్లీ సర్కారు ఫిర్యాదు చేసింది. తమ ప్రభుత్వం జారీ చేసిన సర్వీసెస్ సెక్రటరీ బదిలీ ఉత్తర్వును కేంద్రం అమలు చేయడం లేదని, ఇది కోర్టు ధిక్కారమేనని ఆప్ ప్రభుత్వం వాదించింది. శుక్రవారం ఈ విషయమై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే వచ్చే వారం ఈ పిటిషన్ను విచారిస్తామని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ వెల్లడించారు.
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్కు 10 మంది ఆల్డర్మెన్ను నియమించడంలో ఢిల్లీ మంత్రి మండలి సలహాను లెఫ్ట్నెంట్ గవర్నర్ అనుసరించాలని సుప్రీం కోర్టు శుక్రవారం తెలిపింది. కేసు తదుపరి విచారణను ఈ నెల 16న చేపడతామని పేర్కొంది.