Kerala High Court | కొచ్చి : వేర్వేరుగా జీవిస్తున్న దంపతులు తమ మూడేళ్ల కుమార్తెకు పేరును నిర్ణయించడంలో ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. 2020 ఫిబ్రవరి 12న జన్మించిన ఆ చిన్నారి తన తల్లి వద్దనే ఉంటున్నది. ఆమె జనన ధ్రువీకరణ పత్రంలో పేరు లేకపోవడంతో ఆమె తల్లి జనన, మరణాల రిజిస్ట్రార్ కార్యాలయంలో పేరును నమోదు చేయించేందుకు ప్రయత్నించారు.
పేరు రిజిస్ట్రేషన్ చేయాలంటే తల్లిదండ్రులిద్దరూ తన సమక్షంలో హాజరుకావాల్సిందేనని ఆ రిజిస్ట్రార్ చెప్పారు. దీంతో ఆ తల్లి కేరళ హైకోర్టును ఆశ్రయించారు. ఆ బాలికకు తల్లి సూచించిన పేరుతోపాటు తండ్రి పేరును కూడా జత చేసి హైకోర్టు నామకరణం చేసింది.