Assam CM : అస్సాం ముఖ్యమంత్రి (Assam CM) హిమంత బిశ్వశర్మ (Himanta Biswa Sarma) ను హత్య చేస్తామని బెదిరించిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కోటి రూపాయలు ఇస్తే అస్సాం ముఖ్యమంత్రిని చంపేస్తానని శుక్రవారం ఒక నిందితుడు సోషల్ మీడియా (Social Media) లో ఆఫర్ ప్రకటించాడు. దాంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
అస్సాం రాజధాని గువాహటిలోని ఖానాపారా వెటర్నరీ అండ్ అగ్రికల్చరల్ మైదానంలో సీఎం హిమంత బిశ్వశర్మ శుక్రవారం ప్రసంగించారు. ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారమవుతుండగా లైవ్ చాట్ సెక్షన్లో నిందితుడు ఈ బెదిరింపులకు పాల్పడ్డాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడితోపాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఆ చాట్లో నిందితుడు పాకిస్థాన్కు అనుకూలంగా నినాదాలు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని మొరిగావ్ జిల్లాకు చెందిన అబ్దుల్ ముతలెబ్గా గుర్తించారు. అతడికి సహకరించిన అతడి ముగ్గురు స్నేహితులు కటకటాల వెనక్కి వెళ్లారు.