Congress | న్యూఢిల్లీ, మార్చి 8: ఆదాయ పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. గత సంవత్సరాలకు సంబంధించి ఐటీ రిటర్న్స్లో వ్యత్యాసాలకు గానూ ఐటీ శాఖ ఇటీవల విధించిన రూ.210 కోట్ల జరిమానాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ వేసిన పిటిషన్ను ట్రిబ్యునల్ శుక్రవారం తిరస్కరించింది.
ఈ నేపథ్యంలో అతి త్వరలో హైకోర్టును ఆశ్రయించే అంశంపై కూడా పరిశీలన చేస్తున్నామని ఆ పార్టీ కోశాధికారి అజయ్ మాకెన్ పేర్కొన్నారు. ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నదని ఆరోపించారు. పార్టీకి చెందిన దాదాపు రూ.270 కోట్ల ఫండ్స్ను ఐటీ అధికారులు స్తంభింపజేశారని పేర్కొన్నారు.