న్యూఢిల్లీ: పిల్లల దగ్గుముందు సిరప్లు, జలుబు మందులు వాడకంపై నిబంధనలు కఠినతరం చేయాలని కేంద్రం భావిస్తున్నది. దగ్గు మందు సిరప్, జలుబు మందులను రెండేండ్ల లోపు పిల్లలకు వైద్యులు సూచించకుండా, ఐదేండ్లలోపు పిల్లలు వాడకుండా కేంద్ర ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. కల్తీ దగ్గు మందు సిరప్లు వాడటం వల్ల భారత్ సహా పలు దేశాల్లో చిన్న పిల్లల మరణాలు నమోదు కావటం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేకెత్తించింది.
దీనిపై ఇండియన్ ఫార్మాకోపియా కమిషన్ (ఐపీసీ) డ్రాఫ్ట్ నిబంధనలను రూపొందించింది. వీటి ప్రకారం వైద్యులు, ఫార్మాసిస్టులు సురక్షితమైన ప్రిస్క్రిప్షన్ పద్ధతులు అనుసరించాలి.