Fake Calls | న్యూఢిల్లీ: గుర్తు తెలియని నంబర్లతో వచ్చే మోసపూరిత ఫోన్కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని దేశ పౌరులను కేంద్రం హెచ్చరించింది. మోసగాళ్లు టెలికం సర్వీస్ ప్రతినిధులుగా, సాంకేతిక సిబ్బందిగా పరిచయం చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారని తెలిపింది.
సిమ్ కార్డు లేదా నెట్వర్క్లో సమస్య ఉందని, దీని పరిష్కరిస్తామని మాయమాటలు చెప్తారని పేర్కొన్నది. *401# నొక్కి తర్వాత గుర్తు తెలియని నంబర్ చెప్పి, దానికి డయల్ చేయాలని కోరుతారని వివరించింది. అలా చేస్తే ఫోన్లో ‘అన్ కండీషనల్ కాల్ ఫార్వర్డింగ్’ యాక్టివేట్ అవుతుందని, దీంతో ఆ గుర్తు తెలియని వ్యక్తి నియంత్రణలోకి మన ఫోన్ వెళ్లిపోతుందని తెలిపింది.