న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: వీబీ-జీ రామ్ జీ పథకానికి రూ. 95,692.31 కోట్లు, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణాభివృద్ధి ఉపాధి పథకానికి రూ.30 వేల కోట్లను కేంద్రం బడ్జెట్లో కేటాయించింది. ప్రస్తుతం వీబీ-జీ రామ్ అమల్లోకి వచ్చే వరకు ఎంజీఎన్ఆర్ఈజీఏ ద్వారానే పెండింగ్ పనులను పూర్తి చేస్తున్నట్టు ఒక అధికారి తెలిపారు.
అందుకే ఈ పథకానికి రూ. 30 వేల కోట్లను కేటాయించారు. ప్రస్తుత కేంద్ర బడ్జెట్ ప్రకారం గ్రామీణ అభివృద్ధికి 1,94,368.81 కోట్లు కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన 1,84,995.61 తో పోలిస్తే ఇది స్వల్పంగా ఎక్కువ.