న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: ‘భారత్ రైస్’ బ్రాండ్ పేరుతో బియ్యం అమ్మకాల్ని కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రారంభించింది. సబ్సిడీ రేటులో కిలో రూ.29 ధరకు 5 కిలోలు, 10 కిలోల బియ్యం బ్యాగుల్ని మార్కెట్లోకి విడుదల చేసింది. బియ్యం బ్యాగుల్ని వినియోగదారులకు చేర్చే.. 100 మొబైల్ వ్యాన్లకు న్యూఢిల్లీలో కేంద్ర ఆహార మంత్రి పీయూష్ గోయల్ జెండా ఊపి ప్రారంభించారు.
ప్రతి బ్యాగ్లో 5 శాతం వరకు నూకలు ఉంటాయని చెప్పారు. కేంద్రం ఇప్పటికే భారత్ దాల్, భారత్ ఆటా.. పేరుతో శెనగ పప్పు, గోధుమ పిండి అమ్మకాలను ప్రారంభించింది.